హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఆసియా అండర్-20 వాలీబాల్ టోర్నీకి రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి లావణ్య ఎంపికైంది. సెమెయ్(కజకిస్థాన్) వేదికగా ఈనెల 4 నుంచి 11 వరకు జరిగే టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకుంది.
ఆసియా టోర్నీ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో లావణ్య మెరుగైన ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు. ఆసియా వాలీబాల్ చాంపియన్షిప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్న యువ ప్లేయర్ను శుక్రవారం హైదరాబాద్లో గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు. మెగాటోర్నీలో సత్తాచాటి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకులాల అధికారులు పాల్గొన్నారు.