హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆలిండియా ర్యాం కింగ్ టెన్నిస్ టో ర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి రన్నరప్గా నిలిచాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ లో జరుగుతున్న టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో శుక్రవారం సాయి కార్తీక్ 7-5, 4-6, 2-6తో మనీష్ (కర్ణాటక) చేతిలో ఓటమి పాలయ్యాడు.
అంతకుముందు సెమీఫైనల్లో సాయి కార్తీక్ 6-3, 6-4తో తుషార్ మదన్ (ఢిల్లీ)పై, క్వార్టర్ ఫైనల్లో 6-2, 7-5తో యష్ యాదవ్ (మధ్యప్రదేశ్)పై, ప్రిక్వార్టర్స్లో 6-1, 6-0తో గోకుల్ సురేశ్ (తమిళనాడు)పై విజయాలు సాధించాడు.