దుబ్బాక, సెప్టెంబర్ 7: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఆనంతరం లచ్చపేటలో ఇటీవల మృతి చెందిన మహిళా రైతు పుల్లురు బాలనర్సవ్వ కుటుంబానికి మంజూరైన రూ.5 లక్షల రైతు బీమా చెక్కు, అక్తర్బేగానికి మంజూరైన రూ.24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్గౌడ్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్రెడ్డి ,కౌన్సిలర్లు బంగారయ్య, శ్రీజ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.