వరంగల్ అర్బన్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి తెలంగాణ వీఏవోల సంఘం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు తమ మద్దతు తెలుపుతూ హన్మకొండలో ఓ సమ్మేళనం నిర్వహించింది. ఈ సమ్మేళనానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం మీరంతా ఒక్కటి అవడం, ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో 17, 790 మంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2, 659 మంది వీఏవోలు ఉన్నారన్నారని మంత్రి తెలిపారు. వీరు మహిళా సంఘాల రికార్డుల నిర్వహణ వంటి విధులు నిర్వహిస్తున్నారన్నారు. కాగా, వీఏవోలకు రూ. 10 వేల వరకు జీతాలు పెంచాలని అడిగారు. ఆ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.