వరంగల్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం, సుసంపన్నంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావుతో కలిసి వినోద్కుమార్ శనివారం పర్వతగిరి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిని ఆయన పరిశీలించారు. వేసవిలోనూ బావిలో నీరు నిండుగా ఉండటం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గతంలో నీళ్లు లేక అల్లాడిన రైతాంగానికి ఇబ్బందులు తీర్చేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని వినోద్ కుమార్ చెప్పారు. సాగునీటి రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో చెరువుల్లోకి ప్రాజెక్టుల నుంచి నీరు తరలి వస్తుందన్నారు. తద్వారా భూగర్భ జల మట్టాలు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతో నేడు వ్యవసాయబావుల్లో చేతికి అందే ఎత్తులోనే నీళ్లు ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.