హైదరాబాద్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోల్చితే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. మరో 1,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,017 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణలో ఇవాళ 53,073 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.