హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో మేధావులైన పట్టభద్రులు బీజేపీ తగిన గుణపాఠం నేర్పారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి విజయంపై ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఖాళీ కావడం శుభపరిణామం అన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నాయకులపై వాడుతున్న పదజాలాన్ని మానుకోకపోతే భవిష్యత్తులో ప్రజల చేతిలో మరింత ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాణీదేవి గెలుపు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన కానుకగా భావిస్తున్నట్లు తెలిపారు.