హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పారా షూటింగ్ చాంపియన్షిప్లో హైదరాబాదీ సందేశ్ రెడ్డి విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన పురుషుల 50మీటర్ల వ్యక్తిగత పిస్టల్ ఈవెంట్లో సందేశ్ 219 పాయింట్లతో పసిడి పతకం కొల్లగొట్టాడు. క్వాలిఫయింగ్ రౌండ్ నుంచే తనదైన జోరు కనబరిచిన సందేశ్ పతక పోరులోనూ సత్తాచాటాడు. రుద్రాంశ్ (217), దీపేందర్సింగ్ (198) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.