మేడ్చల్ మల్కాజిగిరి : పచ్చదనంలో తెలంగాణ దేశంలో నే నంబర్ వన్గా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు నాగారంలో జ్యూట్ బ్యాగులను మంత్రి పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకే ప్రతి గ్రామంలో, పట్టణాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన తరువాత మన సీఎం కేసీఆర్ పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్లను, వైకుంఠదామాలను, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, హరితహారంతో గ్రామాలు, పట్టణాలు పచ్చటితోరణాలుగా దర్శనం ఇస్తున్నాయన్నారు.
అనంతరం దమ్మాయిగూడలో జరుగుతున్న సీవరేజ్ పైప్లైన్ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, కమిషనర్లు ఎ.వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు మల్లేష్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.