రామగిరి, సెప్టెంబర్ 18 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు నాటి ఉద్యమంలో భాగస్వామ్యులైన వారిని ఘనంగా సన్మానించారు. సూర్యాపేటలో మినీ ట్యాంక్బండ్ వద్ద గల బతుకమ్మ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కవులు, కళాకారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సన్మానించారు. నల్లగొండలో జరిగిన ఉత్సవాల్లో జడ్పీచైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్రెడ్డి హాజరై నాటి పోరాట యోధులు, కవులు, కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.
భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 18 : ప్రజాప్రతినిధులు,ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయని కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి మాట్లాడారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు 16,17,18వ తేదీల్లో అంగరంగ వైభవంగా జరిగాయన్నారు 16న భువనగిరి-ఆలేరు నియోజకవర్గాల్లో మహిళలు, ప్రజాప్రతినిధులతో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు చేపట్టామన్నారు.
స్వాతంత్ర సమరయోధులను సన్మానిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి
17న అన్ని మండ లాలు, గ్రామాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణలతో పాటు 18న స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను సన్మా నించుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. కార్యక్రమంలో డీసీపీ కే. నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ డీ. శ్రీనివాస్రెడ్డి, డీఈఓ నారాయణరెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, బీసీ సంక్షేమశాఖ అధికారి యాదయ్య, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగ్తానాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి పీ. వెంకటేశ్వర్రావు, యువజన సంక్షేమ శాఖ అధికారి ధనుంజనేయులు, స్వాతంత్య్ర సమరయోధులు బత్తిని యాదగిరిగౌడ్, మన్నె గోపాల్రెడ్డి, ఎడ్ల నారాయణరెడ్డి, ప్రభాకర్, హరిబాబు పాల్గొన్నారు.
తాజ్పూర్లో కళాకారులకు సన్మానం
భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ జా తీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని తాజ్పూర్లో కళాకారులను సర్పంచ్ బొమ్మారపు సురేశ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ర్యాకల సంతోష, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, వార్డుసభ్యులు కొండల్, సందీప్, రామస్వామి, టీఆర్ఎస్ నాయకులు నాగయ్య,నర్సింహ, బాలరాజు, రమేశ్, గణేశ్, సుగుణాకర్, హరికృష్ణ, భాస్కర్, సాయి, ప్రవీణ్ పాల్గొన్నారు.