హైదరాబాద్ : హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన వాణీదేవి విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉద్యోగులు, పట్టభద్రులు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. విద్యావంతురాలిని గెలిపించి మండలికి పంపారు.
ఈ విజయంతో రాష్ట్రంలో ఎన్నికేదైనా టీఆర్ఎస్దే గెలుపని రుజువైంది. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకుంటారు. ఫలితాలను చూసైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలి. టీఆర్ఎస్ అభ్యర్థికి ఏకపక్ష విజయాన్ని అందించిన పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు. వాణీదేవి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మంత్రులు పేర్కొన్నారు.