సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను శనివారం ఆయన నివాసంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జర్నలిస్టు సంఘాల నాయకులు కలుసుకున్నారు. రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను శాలువాతో సత్కరించారు. సుప్రీంకోర్టులో రెండురోజుల క్రితం తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో సానుకూల తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అల్లం నారాయణతోపాటు జర్నలిస్టు సంఘాల నాయకులను మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వివిధ విషయాలు అడిగి తెలుసుకున్నారు. ‘కొలిమి అంటుకున్నది’ అనే పుస్తకం గురించి ప్రస్తావించారు. ఎన్వీ రమణను కలిసినవారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఢిల్లీ టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు, తదితరులున్నారు.