హైదరాబాద్ : వైద్యరంగంలో దేశంలోనే తెలంగాన మేటిగా నిలుస్తోందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలోని బీఎన్రెడ్డినగర్ శ్రీపురం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బృంగి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి తెలిపారు. రాష్ర్టాన్ని హెల్త్ హబ్గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు ఉత్తమమైన సేవలందించి, వారి ఆదరణ పొందాలని యాజమాన్యానికి సూచించారు.