హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. బోర్డు చైర్మన్ కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పిన్నపురం జల విద్యుత్ ప్రాజెక్టును ఆపాలని విజ్ఞప్తి చేశారు. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని కోరారు. బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టవద్దన్నారు. లేఖలోని అంశాలను జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ఈఎన్సీ బోర్డు చైర్మన్ను కోరారు.