హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కేసీఆర్ పౌష్టికాహార కిట్ల సరఫరా టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, టెండర్ల ఖరారు చేసేందుకు అనుమతులివ్వాలన్న ప్రభుత్వ వినతికి జస్టిస్ విజయ్సేన్రెడ్డి అనుమతించారు.
చట్టబద్ధత అంశాలపై తర్వాత విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఈ పిటిషన్పై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, టెండర్లను ఖరారు చేయడం వల్ల నష్టం ఉండబోదన్నారు.