ధర్మారం, సెప్టెంబర్ 9: కార్పొరేట్కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో జరిగిన ‘స్వచ్ఛ గురుకుల’ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యాలయ ఆవరణలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురుకులాల ఆర్సీవో అనంత లక్ష్మి, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడారు. స్వరాష్ట్రంలో గురుకుల స్కూళ్లకు వన్నె తెచ్చామని, నేడు ప్రతి విద్యార్థి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే స్థాయిలో బోధన జరుగుతున్నదని వివరించారు.
విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభచూపుతున్నారని, ఇందుకు సుమారు 150కి పైగా ఎంబీబీఎస్లో సీట్లు సాధించడమే నిదర్శమని చెప్పారు. ఉత్తమ ఫలితాలతో ఇతర రాష్ర్టాలు మన గురుకుల విద్యావిధానంపై అధ్యయన చేసే స్థాయికి చేరామని చెప్పారు. గురుకులాల్లో వంద శాతం ఫలితాల సాధనకు బోధన సిబ్బంది విద్యార్థులను దత్తత తీసుకోవాలని సూచించారు. గతేడాది ఇంటర్, పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. మల్లాపూర్ గురుకులంలో చదివి ఎంపీడీవోగా ఉద్యోగం సాధించిన ధర్మారం ఎంపీడీవో జయశీలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు, పెయింటింగ్లను ఆయన పరిశీలించారు.
విద్యాలయంలో పచ్చ గరకతో తయారు చేసిన స్వచ్ఛ గురుకులం చిత్రపటంతో పాటు ముగ్గును పరిశీలించి విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సమావేశానికి ప్రిన్సిపాల్ గిరిజ అధ్యక్షత వహించగా గురుకులాల ఆర్సీవో అనంత లక్ష్మి, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పత్తిపాక ప్యాక్స్ చైర్మన్ నోముల వెంకట్రెడ్డి, సర్పంచ్ గంధం వరలక్ష్మి -నారాయణ, ఎంపీటీసీ భూక్య సరిత-రాజు, ఎంపీడీవో భీమ జయశీల, తాసిల్దార్ రేవెల్లి వెంకట లక్ష్మి, ఎంపీవో రమేశ్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు మల్లేశం ఉన్నారు.