హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన ఓ దివ్యాంగురాలు ఓటు వేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. అలాగే పోలింగ్ ఏజెంట్ లతో మాట్లాడి ఓటరు గుర్తింపులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పలువురు ఓటర్లతో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని సిబ్బందికి సూచించారు.