ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
ఆత్మకూరు(ఎం), జూన్ 26 : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటు పడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కొరటికల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, కురుమ సంఘం భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆమె శంకుస్థాపన చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ తండా మంగమ్మ, సర్పంచ్ కోల సత్తయ్యగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్, ఏఈ సుధాకర్, ఉప సర్పంచ్ స్వామి, కురుమ సంఘం అధ్యక్షుడు యాదగిరి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సైదులు, నాగరాజు, నర్సయ్య, ఆంజనేయులు, శ్రీనివాస్, కొండల్రావు పాల్గొన్నారు.
రైతు బీమా చెక్కుఅందజేత
ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన బండ చంద్రయ్య, చెరుకు మల్లేశంగౌడ్కు రైతు బీమా ద్వారా మంజూరైన రూ.5లక్షల చొప్పున చెక్కులు మృతుల కుటుంబసభ్యులకు అందించారు. ఆమె వెంట మాజీ మండలాధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య, ఎంపీటీసీ యాస కవిత, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శ్రీనివాస్రెడ్డి, అధికార ప్రతినిధి ఉపేందర్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సోలిపురం అరుణ, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, నాయకులు శ్రీను, బుచ్చయ్య, సత్తయ్య ఉన్నారు.