హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది.
ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.25 వేలు, గాయపడిన ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున మంజూరు చేసినట్టు తాడి టాపర్స్ కార్పొరేషన్ అధికారి రవీందర్ తెలిపారు.