తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత ఐలమ్మ జీవితం, రజాకార్లపై ఆమె చూపిన పోరాట తెగువను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఆమె జీవిత చరిత్రను నాయకులు వివరించారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 26 : తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరవనిత ఐలమ్మ అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్లతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల్లో కూడా ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీలు కృపేశ్, కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, వైస్ ఎంపీపీ వెంకటప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు పాల్గొన్నారు.
ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
పెద్దఅంబర్పేట్ :వీరవనిత చాకలి ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్క మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ లోని తారామతిపేట్ గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్నిఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించటం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేఖ, జడ్పీటీసీ దాసుగౌడ్, సర్పంచ్ మహేశ్గౌడ్, ఎంపీటీసీ వెంకటేశ్యాదవ్, ఉపసర్పంచ్ నర్సింహ, కైతపాక అమృత, నిర్వాహకులు మల్లేశ్, బాలయ్య, పెంటయ్య, వేముల కృష్ణ, సత్తయ్య, రజక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పోరాట యోధురాలు ఐలమ్మ
చేవెళ్లటౌన్ : నిజాం పాలకులు, రజాకార్ల పైశాచికత్వాలపై అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ అని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చేవెళ్లలోని ఇంద్రారెడ్డి చౌరస్తాలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. యావత్ మహిళా లోకానికి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పారు. అందుకు ఐలమ్మ అశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, సర్పంచ్ బండారి శైలజ, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం
షాద్నగర్టౌన్ : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరవనిత ఐలమ్మ అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం పోరాడిందన్నారు. ప్రజలను చైతన్యం చేయడంలో ఆమె పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు క్రిష్ణవేణి, రాజేశ్వర్, శ్రీనివాస్, నందీశ్వర్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్ పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ కిష్టమ్మ, శ్రీనివాస్, రాజు, కుమార్, నర్సింహ, సురేశ్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆమె విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించా రు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అద్యక్షుడు అజయ్, నియోజకవర్గం అధ్యక్షుడు మల్లేశ్, మండల అధ్యక్షుడు వినోద్కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విక్ర మ్, అసైన్డ్ భూ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు.
షాబాద్ : ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రజక సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు గడ్డం చంద్రయ్య అన్నారు. ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో రజకసంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీశైలం, శివకుమార్, మల్లేశ్, సురేశ్, యాదగిరి, బాల్రాజ్, రమేశ్ తదితరులున్నారు.
నందిగామ : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుమార్గౌడ్, ఏపీఎం యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తూరు : తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాయలంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చరత్ చంద్రబాబు, ఎంపీవో నర్సింహ, సర్పంచ్లు కాట్న రాజు, రవి, ఉపసర్పంచ్ దశరథ్నాయక్, రాందాస్నాయక్, మాజీ ఎంపీటీసీ మోడీ దర్శన్ పాల్గొన్నారు.
కడ్తాల్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ జీవితాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఐలమ్మ 127వ జయంతిని రజక, బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, బీసీ సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్, ఏఎంసీ డైరెక్టర్ లాయక్అలీ, రజక సంఘం నాయకులు కృష్ణయ్య, వెంకటయ్య, నర్సింహ, శ్రీనివాస్, అంజయ్య, కరుణాకర్, శేఖర్, బాల్రాజ్, జంగయ్య పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపాలిటీ పరిధిలో ఐలమ్మ జయంతి సందర్బంగా ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే యాదయ్య పూలమాలేసి నివాళి అర్పించారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.