జ్యోతినగర్, అక్టోబర్ 28: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్లో చేపట్టిన 100 మెగావాట్ల ఫ్ల్లోటింగ్ సోలార్ ప్లాంటు గురువారం ఉత్పత్తిని ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగినా గత రెండు నెలలుగా పనులు ఊపందుకోవడం.. మొదటగా 17.5 మెగావాట్ల ఉత్పత్తికి పూర్తి స్థాయిలో అనుమతులు లభించడంతో ఏకంగా కమర్షియల్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టింది. ఇక సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నుంచి మార్కెట్లోకి విద్యుత్తు సరఫరా కానున్నది. ప్లాంటు లో మొత్తం 40 బ్లాకుల్లో ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా 7 బ్లాక్లను ఉత్పత్తికి సిద్ధం చేసుకొని విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ, తెలంగాణ ప్రాజెక్టు సీజీఎం సునీల్కుమార్, జీఎంలు సౌమేంద్ర దాస్, ప్రసెన్జిత్ పాల్, పీకే లాడ్, అనిల్కుమార్, మోహన్రెడ్డి, హెచ్ఆర్ హెడ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.