హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. పోలవరం బ్యాక్ వాటర్పై అధ్యయనం చేయాలని కోరింది. బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని సూచించింది. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు ఉంటుందని స్పష్టం చేసింది. ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటినిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుందని తెలిపింది. ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని పేర్కొంది. రక్షణ కట్టడాలు నిర్మించి, నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. బ్యాక్ వాటర్తో ఏర్పడే ముంపును నివారించాలని, నష్ట నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఈఎన్సీ పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది.