యాదాద్రి, సెప్టెంబర్ 14 : కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 16న ఆలేరు పట్టణంలో 15వేల మందితో మండల పరిషత్ కార్యాలయం నుంచి తాసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం సమావేశం ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీటీసీలు తోటకూరి అనూరాధ, పల్లా వెంకట్రెడ్డి, ఎంపీపీ పైళ్ల ఇందిర, టీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, నరేందర్రెడ్డి, యాదయ్య, వెంకటేశ్గౌడ్, టీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, నాయకులు కవిడే మహేందర్, నర్సింగ్యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా చదివి లక్ష్యాలు అధిగమించాలి
తుర్కపల్లి : ప్రణాళికబద్ధంగా చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి నిరుద్యోగ యువతకు సూచించారు. మండలంలోని మాదాపురం గ్రామంలోని రైతువేదిక భవనంలో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్4 ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, దానికి అనుగుణంగా యువత ఉన్నతంగా చదివి వారి కలలు సాకారం చేయాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే తప్పక ఫలితం ఉంటుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నందున దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, యువజన నాయకుడు గట్టు తేజస్వీనిఖిల్, సుంకరి శట్టయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశట్టి నర్సింహులు, సర్పంచ్ కల్లూరి ప్రభాకర్రెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు నల్ల శ్రీకాంత్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు సీస భరత్, యూత్ ప్రధాన కార్యదర్శి బూసాని వెంకటేశ్, బూక్యా రవీందర్, బీరప్ప, సీస రాజు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చాటేలా వజ్రోత్సవాలు నిర్వహించాలి
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 14 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 16నుంచి 18వరకు నిర్వహించే వజ్రోత్సవాల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చాటుతామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, జిల్లాస్థాయి అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 16నుంచి మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలు గతంలో నిర్వహించని విధంగా గాకుండా కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించాలన్నారు. 16న పట్టణ పరిధిలోని సాయి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించే భారీ ర్యాలీకి నియోజకవర్గ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ర్యాలీలో 15వేల మందికి పైగా పాల్గొనాలని, అందుకు ప్రతి గ్రామం నుంచి తరలిరావాలన్నారు. వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములై తెలంగాణ ప్రజల పోరాట పటి మ, సంస్కృతీ, సంప్రదాయాలు పరిడవిల్లేలా వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, డీఆర్డీఏ ఉపేందర్రెడ్డి, ఆర్డీఓ భూపాల్రెడ్డి, రవాణా శాఖ జిల్లా అధికారి సురేందర్రెడ్డి, ఏసీపీ వెంకట్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, జడ్పీటీసీ బీరు మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ.కిరణ్కుమార్, జనగాం పాండు, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.