హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు.
సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఎంపీలు సంతోష్కుమార్, జీ రంజిత్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ తదితరులు ఉన్నారు.