హైదరాబాద్ : ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసు సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన పోలీసు గార్డు గదిని రాష్ట్ర చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి బుధవారం ప్రారంభించారు. అంతకుక్రితం ప్రధాన న్యాయమూర్తి రాచకొండకు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ అధికారులచే గౌరవ వందనం స్వీకరించారు. ఇతర న్యాయమూర్తులు, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.