హైదరాబాద్, జనవరి19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోయల్ను కేంద్ర ప్రభుత్వం కార్మికశాఖ అదనపు కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఈవో పోస్టును భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొంతమంది అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం వారిలోనుంచి ఒక అధికారిని సీఈఓగా నియమిస్తుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సీఈఓను నియమిస్తూ జీవో విడుదల చేస్తుంది.