హైదరాబాద్ : ప్రగతి భవన్లో మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్కు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది.
కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక కేంద్రానికి ధాన్యం సేకరణపై విధించిన గడువు కూడా ముగియడంతో.. ఈ అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.