హైదరాబాద్ : ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.