హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ నెల 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, పాలనాపరమైన అంశాలు, తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, ఇతర అంశాల్లో కేంద్రం వైఖరి, పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.