హైదరాబాద్ : గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ఆమోదానికి గవర్నర్కు పంపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన యువ నేత కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి గత నెల 21వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన సీఎం కేసీఆర్.. సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. కౌశిక్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని చెప్పారు. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్రెడ్డి కూడా తనకు చిరకాల మిత్రుడని, తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్రెడ్డి నాతో కలిసి పని చేశానని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి సీఎం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.