హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి సభ్యుడు కొవిడ్ నిబంధనలు పాటించాలని సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
ఇవాళ విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, పాఠశాల, సాంకేతిక, ఉన్నతవిద్య సహా వివిధ శాఖల పద్దులకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. అదేవిధంగా క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీశాఖ, పర్యాటక, ప్రభుత్వరంగ సంస్థలు, ఐటీ పరిశ్రమల శాఖల పద్దులపై కూడా చర్చించనున్నారు.