హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. ప్రభుత్వ, పోలీసు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశాల్లో పెండింగ్లో ఉన్న జవాబులు పంపించాలని అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సమాచారం తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఉండాలని సూచించారు. సమావేశాల సమయంలో ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.