హైదరాబాద్ : ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) సైతం పంజా విసురుతోంది. తెలంగాణ సహా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జగిత్యాల జిల్లా మేడిపల్లి తహసీల్దార్ రాజేశ్వర్ ఫంగస్ బారినపడి కన్నుమూశారు. నెల రోజుల కిందట ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ సోకడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగిత్యాలలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్తో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నిన్న కొండగట్టుకు చెందిన వ్యక్తి ఫంగస్ బారినపడి ప్రాణాలు విడిచాడు.