ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇవాళ టెక్నికల్ సమస్య ఉత్పన్నమైంది. దీంతో కాసేపు నిఫ్టీ ట్రేడింగ్ నిలిపివేశారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ల వద్ద లైవ్ ప్రైస్ కనిపించలేదు. ఆ ప్రైస్ అప్డేట్ కాకపోవడంతో ట్రేడింగ్ను ఆపేశారు. ఎన్ఎస్ఈ మార్కెట్లోని అనేక రకాల టెలికాం లింకులు రెండు సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఉంటాయని, అయితే ఆ లింకుల్లో సాంకేతిక సమస్యలు వచ్చినట్లు సర్వీస్ ప్రొవైడర్లు పేర్కొన్నట్లు ఎన్ఎస్ఈ తన ట్విట్టర్లో తెలిపింది. వీలైనంత త్వరలో సిస్టమ్స్ను రిస్టోర్ చేయనున్నట్లు చెప్పారు. అన్ని సెగ్మెంట్లలో 11.40 నిమిషాలకు ట్రేడింగ్ను నిలిపివేసినట్లు ఎన్ఎస్ఈ చెప్పింది. నిఫ్టీ ఇండెక్స్ 14,820 పాయింట్ల వద్ద ఉన్నప్పుడు ట్రేడింగ్ ఆగిపోయింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ నిఫ్టీ 113 పాయింట్లు ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ బ్యాంక్ మాత్రం 35,626 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. సుమారు 11 రంగాలకు చెందిన లైవ్ ప్రైజ్ కోట్లు అప్డేట్ కావడం లేదని ఎన్ఎస్ఈ చెప్పింది.