SouthAfrica-India | ఇండోర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో టీం ఇండియాపై దక్షిణాఫ్రికా కసి తీర్చుకున్నది. కివీస్ బ్యాట్స్మన్లు నిర్దేశించి 228 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో టీం ఇండియా విఫలమైంది. కేవలం 18.3 ఓవర్లలోనే 178 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తత్ఫలితంగా దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అయితే, ఇప్పటికే తొలి రెండు టీ-20 మ్యాచ్ల్లో టీం ఇండియా విజయం సాధించింది. దీంతో సిరీస్ను టీం ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. ఇక గురువారం నుంచి రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ మొదలు కానున్నది.
దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్లు చెలరేగి ఆడిన పిచ్ మీద టీం ఇండియా ఆటగాళ్లు తేలిపోయారు. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ ఒక పరుగు, ఎస్కే యాదవ్ 8 పరుగులు, అక్షర్ పటేల్ 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. దినేష్ కార్తిక్ నాలుగు సిక్స్లు, నాలుగు ఫోర్లతో 46 పరుగులు చేయడంతో కాస్త ఆశలు చిగురించాయి. కానీ, రిషబ్ పంత్, కార్తిక్, సూర్య కుమార్ యాదవ్ ఔట్ కావడంతో జట్టు ఆశలు అడియాసలయ్యాయి.
చివర్లో దీపక్ చాహర్ 31 పరుగులు, ఉమేశ్ యాదవ్ 20 పరుగులతో 48 పరుగులు జోడించారు. దీంతో మ్యాచ్ గాడిలో పడినట్లు కనిపించినా 16 ఓవర్ తర్వాత వికెట్ల పతనంతో టీం ఇండియా ఓటమి పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. రెండు మ్యాచ్ల్లో విఫలమైన రిలీ రొసోవ్ కేవలం 48 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ 68 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 23, డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేశారు.
South Africa finish the series on a high with a comprehensive win over India 👏#INDvSA | 📝 Scorecard: https://t.co/Za8J5e3abK pic.twitter.com/dBzBgSs3fe
— ICC (@ICC) October 4, 2022