ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఎలాగైనా గెలవాలని భారత జట్టు ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో జట్టులో కచ్చితంగా దినేష్ కార్తీక్ వంటి ఆటగాడు ఉండాల్సిందేనని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్లో దినేష్ కార్తీక్ ప్రదర్శన చూస్తే అతన్ని కచ్చితంగా ప్రపంచకప్ ఆడించాలని, మెగాటోర్నీలో అతను ఆడకపోతే తాను ఆశ్చర్యపోతానని పాంటింగ్ చెప్పాడు.
‘‘తనను ఐదు, ఆరు స్థానాల కోసం కచ్చితంగా జట్టులో ఉంచుతాను. ఈ ఏడాది ఆర్సీబీ మ్యాచులను అతను ఎలా ముగించాడో చూడండి. తన ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కీపర్గా పంత్ ఉంటాడు. కానీ దినేష్ అద్భుతంగా ఆడుతున్నాడు’’ అని తన వాదనను బలపరుచుకున్నాడు. అలాగే ఆర్సీబీపై డీకే చాలా ప్రభావం చూపించాడని కూడా అన్నాడు.
అంత అద్భుతమైన ఫామ్లో ఉన్న డీకే.. టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో లేకపోతే అది పెద్ద షాకేనని పేర్కొన్నాడు. కాగా, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత.. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టులో దినేష్ కార్తీక్ చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్లో డీకే రాణిస్తే.. కచ్చితంగా ప్రపంచకప్ ఆడే జట్టులో కూడా డీకే ఉంటాడని పలువురు మాజీలు అంటున్నారు. తొలి టీ20లో కేవలం రెండు బంతులే ఎదుర్కొన్న డీకేకు.. మిగతా మ్యాచుల్లో అయినా సత్తా చాటే ఛాన్స్ వస్తుందేమో చూడాలి.