లక్నో: నీట మునిగిన స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు వరుసగా కుర్చీలు వేసి వాటిని పట్టుకోగా ఒక టీచర్ వాటిపై నడిచి స్కూల్కు వచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వర్షాల నేపథ్యంలో ఒక ప్రభుత్వ స్కూల్ ప్రాంగణమంతా నీటితో నిండింది. బుధవారం ఆ స్కూల్ విద్యార్థులు వర్షం నీటిలో నడుచుకుంటూ క్లాస్ రూమ్లకు చేరుకున్నారు. అయితే టీచర్లు మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలపై నడిచి వచ్చారు. వర్షం నీటితో నిండిన కాంపౌడ్లో వరుసగా పేర్చి విద్యార్థులు పట్టుకున్న కుర్చీల మీదుగా ఒక ఉపాధ్యాయురాలు నడుచుకుంటూ స్కూల్లోకి ప్రవేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది అధికారుల దృష్టికి వెళ్లగా ఆ టీచర్ను సస్పెండ్ చేశారు.
మరోవైపు యూపీలో జరిగిన మరో సంఘటనలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు క్లాస్ రూమ్లోనే విద్యార్థితో మసాజ్ చేయించుకుంది. హర్దోయ్లోని పోఖరి ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థితో మసాజ్ చేయించుకున్న మహిళా టీచర్ ఉర్మిళా సింగ్ను అధికారులు సస్పెండ్ చేశారు.
School teacher is sitting comfortably and pressing her hands with the children of the class in Uttarpradesh Hardoi
Action initiated by concern authorities
Bringing shame to such noble profession 🙆#Hardoi pic.twitter.com/yRRSUCs6lH— Nandini Idnani 🇮🇳🚩 (@nandiniidnani69) July 28, 2022