Chandrababu on Vijayamma | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మొన్న చెల్లి షర్మిల వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం, శనివారం జరుగనున్నాయి.
తొలి రోజు సమావేశంలో పాల్గొన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కూతురు వైఎస్ షర్మిలకు అండగా నిలిచేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు స్పందిస్తూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ అందరినీ వాడుకుంటాడు అని ఎద్దేవా చేశారు.
చీకటి పాలన వద్దూ చీకటి జీవోలు వద్దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అన్నా చెల్లెండ్ల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి.