అమరావతి : గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న వైసీపీ పార్టీ ప్లీనరీ సందర్భంగా వర్సిటీకి రెండురోజుల పాటు సెలవులు ప్రకటించడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్లీనరీ కోసం వైసీపీ అధికార దుర్శినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా ప్లీనరీకి అవకాశం ఇవ్వడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి రెండు రోజులు సెలవులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
ప్లీనరీకి అనుమతి ఇచ్చిన వర్సిటీ వీసీ సరైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నిర్వహిస్తున్నది వైసీపీ పార్టీ ప్లీనరి కాదని ప్రభుత్వ ప్లీనరీ అని ఎద్దేవా చేశారు. స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలను బలవంతంగా లాక్కుంటున్నారని, డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.