అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్పై టీడీపీ నిర్వహిస్తున్న చలో
అమర్లపూడి ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామానికి ఎవరిని రానీయకుండా ఇరువైపులా బందోబస్తును ఏర్పాటు చేశారు.
నిబంధనలను ఉల్లంఘించి అమర్లపూడికి వచ్చిన ధూళిపాళ్ల నరేంద్రతో పాటు టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది . కొన్ని ప్రాంతాల్లో స్థానిక టీడీపీ నాయకులను గృహనిర్భందం చేశారు. గుంటూరులో టీడీపీ నాయకుడు నక్కా ఆనంద్బాబును , మంగళగిరిలో గంజి చిరంజీవిని పోలీసులు గృహనిర్బంధించారు. గుంటూరు రింగ్రోడ్డులోని ఆలపాటి రాజా ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.