TCS ends WFH | వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్)పై దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక నిర్ణయం తీసుకున్నది. నవంబర్ 15 నుంచి ఉద్యోగులంతా ఆపీసులకు రావాలని టీసీఎస్ ఆదేశించినట్లు టెక్ వెబ్సైట్ ట్రాక్ ఇన్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
దీంతో కరోనాను నియంత్రించడానికి గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికినట్లైందా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీసీఎస్లోని ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సంస్థ హెచ్ఆర్ హెడ్ మిలిండ్ లక్కాడ్ చెప్పారు.
అయితే, రెండు డోస్ల వ్యాక్సిన్లు వేసుకున్న వారు మాత్రమే ఆఫీసులకు రావాలని మిలింద్ లక్కాడ్ చెప్పారని తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ప్రస్తుతం 70 శాతానికి పైగా రెండు డోస్లు వేసుకున్నారు. 95 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు సింగిల్ డోస్ వేయించుకున్నారు. అర్హులైన ఉద్యోగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నుంచి 100 శాతం అలవెన్స్లు పొందుతారన్నారు.
ఇదిలా ఉంటే వచ్చే నాలుగేండ్లలో అంటే 2025 నాటికి కేవలం 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులో సేవలందిస్తారని, మిగతా 75 శాతం మందికి వర్క్ ఫ్రం హోం వర్తిస్తుందని ప్రకటించింది టీసీఎస్. గత కొన్ని వారాలుగా టీసీఎస్ ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా ఆఫీసులకు వస్తున్నారని సంస్థ ఇంతకుముందు తెలిపింది.
2025 విజన్ను టీసీఎస్ దశల వారీగా అమలు చేయనున్నది. ఈ ఏడాది చివరి నాటికి 80 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తే వచ్చే ఏడాది 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు వస్తారని.. అటుపై అది 2025 నాటికి 25 శాతానికి దిగి వస్తుందని సమాచారం. ఇప్పటికే భారత్లోని ఇతర ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, విప్రో తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీసు చేపట్టాలని ఆదేశించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఫోన్13కు చిప్ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!