TCS WFH Over | కరోనా మహమ్మారి వల్ల 2020 ప్రారంభంలో మొదలైన వర్క్ ఫ్రం హోం సంస్కృతి చివరి దశకు చేరుకున్నది. కొవిడ్ను కట్టడి చేయడానికి సుదీర్ఘకాలంగా వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న ఉద్యోగులు ఇక ఆఫీసులకు రావాల్సిందేనని ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ తేల్చి చెప్పింది. ఈ మేరకు సిబ్బందికి ఈ-మెయిల్స్ పెట్టింది. వచ్చే నవంబర్ 15 నుంచి వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న సిబ్బంది తిరిగి ఆఫీసులకు రావాలని పేర్కొంది. కొవిడ్ ప్రారంభంలోనే ఇంటి వద్ద నుంచి పని చేయడానికి టీసీఎస్ అనుమతి ఇచ్చింది.
ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టడంతోపాటు యధాతథంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రంహోం కల్చర్కు చెల్లుచీటి ఇవ్వాలని టీసీఎస్ భావిస్తున్నది. వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్) సేవలందిస్తున్న ప్రతి ఉద్యోగి కూడా కార్యాలయానికి రావాల్సిందేనని పేర్కొన్నది.
95 శాతం మంది పాక్షికంగా, 70 శాతానికి పైగా సిబ్బంది పూర్తిస్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ చెప్పారు. ఇప్పటికైతే 20-25 శాతం సిబ్బంది వర్క్ ఫ్రం హోం సేవలు వదిలేసి కార్యాలయాలకు వస్తున్నారన్నారు. 25/25 ప్లాన్ మరింత నియంత్రిత పద్దతిలో అమలు చేయాల్సి ఉందన్నారు.
వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేలా ప్రోత్సహించడానికి వేరియబుల్ పే పాలసీ అమలు చేస్తున్నది. మిగతా టెక్, ఐటీ సంస్థలతో సంబంధం లేకుండా సిబ్బందికి చెల్లించే వేరియబుల్స్ యధాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. టీసీఎస్లో ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే చెల్లిస్తున్నది.
కానీ, తమ లాభాల్లో కోత విధించకుండా విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు వేరియబుల్ పేమెంట్స్లో కోత విధించాయి. మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వేరియబుల్ పేమెంట్స్ పూర్తిగా నిలిపేసింది. ఫ్రెషర్, జూనియర్ లెవల్ స్టాఫ్కు 30 శాతం కోత విధించింది. ఇన్ఫోసిస్ 70 శాతం వేరియబుల్ పేమెంట్స్ చెల్లిస్తున్నట్లు తెలిపింది.