న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుందని సూచించింది. సిబ్బందికి పంపిన ఈ-మెయిల్లో ఈ విషయాన్ని తెలిపింది. మూన్లైటింగ్స్ అధికమవుతున్న ప్రస్తుత తరుణంలో సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఇప్పటికే పలువురు సీనియర్ స్థాయి ఉద్యోగులు ఆఫీస్ నుంచి లేదా క్లయింట్ల లోకేషన్ల నుంచి సేవలు అందిస్తున్నారు. రెండేండ్ల తర్వాత హైబ్రిడ్ పద్దతిని ప్రవేశపెట్టాలనుకుంటున్న సంస్థ… అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నది. ప్రస్తుతం సంస్థకు అంతర్జాతీయంగా 6 లక్షల మంది సిబ్బంది కలిగివున్నది.