టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ హెచ్చరిక
సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 23 : టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ అన్నారు. బీజేపీ నాయకులు మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తూ శ్రీరాంపూర్లో ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 20 ఏండ్ల క్రితం పోయిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి కారు ణ్య నియామాకాల పేరుతో సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కవితకే దక్కుతుందన్నారు.
ఆమె నాయకత్వం లో కార్మికులు అనేక హక్కులు సాధిం చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. బొగ్గు గని కార్మికులకు కేంద్రంతో ఆదాయ పన్ను రద్దు చేయించడం చేతగాని బీజేపీకి, సింగరేణి కార్మికుల గురించి మాట్లా డే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్ శాసన మండలి, అసెంబ్లీలో ఆదాయ పన్ను రద్దు కోసం తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినప్పటికీ పట్టించుకోలేదని వ్యా ఖ్యానించారు. ఈ విషయమై గతంలో ఎంపీగా ఉన్న కవిత కూడా పార్లమెంట్ లో ప్రస్తావించిన సంగతిని గుర్తుచేశారు. ఇలా సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న కవిత, సీఎం కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఓ వైపు ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలం వేస్తూనే సింగరేణిని ప్రైవేట్పరం చేయమని బీజేపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.