TaMo gets Sanand Ford Unit | అహ్మదాబాద్కు సమీపంలోని ఫోర్డ్ ఇండియా సనంద్ కార్ల తయారీ యూనిట్ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకోనున్నది. ఈ మేరకు ఫోర్డ్ ఇండియా, టాటా మోటార్స్ మధ్య కుదిరిన ఒప్పంద ప్రతిపాదనను గుజరాత్ ప్రభుత్వం ఆమోదించింది. ఫోర్డ్ నుంచి టాటా మోటార్స్కు సనంద్ ప్లాంట్కు అప్పగించేందుకు గతవారం గుజరాత్ సర్కార్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది.
టాటా మోటార్స్, ఫోర్డ్ మధ్య సోమవారం ఎంవోయూ ( అవగాహనా ఒప్పందం – Memorandum Of Understanding -MOU ) కుదురుతుందని ఒక ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం వచ్చింది. ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ ప్రభుత్వం కల్పించిన ఇన్సెంటివ్లు టాటా మోటార్స్కు కూడా వస్తాయి. అయితే, ఈ డీల్కు సంబంధించి కార్మికుల భద్రత, ఆర్థికాంశాలు, డ్యూటీలు, బెనిఫిట్లు తదితర అంశాలపై ఇరు సంస్థలు ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నాయి. వివిధ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేస్తాయని సమాచారం.
భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది ఈ అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్ట్ ప్రకటించింది. గత ఏప్రిల్ నుంచే గుజరాత్లోని సనంద్ ప్లాంట్ నుంచి కార్ల ఉత్పత్తి నిలిపివేసింది. ఇప్పటికే భారత మార్కెట్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్న ఫోర్డ్.. విదేశాలకు ఎగుమతి చేయడానికి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నది. పీఎల్ఐ కింద ఫోర్ట్కు ఇన్సెంటివ్లు ఇవ్వడానికి కేంద్రం కూడా సరేనన్నది.
కానీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు పూర్తిగా భారత్ మార్కెట్ నుంచే నిష్క్రమించాలని నిర్ణయించినట్లు ఇటీవలే ఫోర్డ్ అధికారికంగా ప్రకటించింది కూడా. తొలుత పీఎల్ఐ కింద ఈవీ కార్లను గుజరాత్ యూనిట్ నుంచే ఉత్పత్తి చేయాలని ఫోర్డ్ భావించింది.