వేటగాళ్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
బషీరాబాద్, మార్చి 28: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి వేటగాళ్లు నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడుతూ అలజడి సృష్టించారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు, బషీరాబాద్ పోలీసులతో కలిసి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే అడవి పందిని వేటాడగా.. పదిమందిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. వారినుంచి నాలుగు నాటు తుపాకులు, తొమ్మిది సెల్ఫోన్లు, ఐదు బైకులను స్వాధీ నం చేసుకుని బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపారు.