సూర్యాపేట : ఎస్సీలకు మేలు జరిగే దళితబంధు పథకాన్ని సీపీఎం పార్టీ ఆహ్వానిస్తోందని, ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంత మంది దళిబంధు పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని, పథకం విజయవంతమైతే తమ భవిష్యత్ దెబ్బతిని ఎన్నికల్లో ఓటమి చెందుతామని విపక్షాలు ఆలోచించడం సరైంది కాదన్నారు. పేదలకు లబ్ధి జరిగే పథకాలను ఆహ్వానించాలని, దళితబంధు నేపథ్యంలో ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. కరోనా మూడో వేవ్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాక్సిన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ప్రజలందరికీ వందశాతం రెండు డోసుల వ్యాక్సిన్ అందించాలని సూచించారు.