హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ‘నీట్’ను రద్దు చేయించేందుకు తమిళనాడు ప్రభుత్వం తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నది. దీనిలో భాగంగా ఆ రాష్ట్రంలోని అధికార డీఎంకే ఎంపీ లు ఇళంగోవన్, యెరస్వామ్యన్ బుధవారం తెలంగాణభవన్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. నీట్ రద్దుకు తమతో కలిసిరావాలని విజ్ఞప్తిచేశారు. అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంలేదని, నీట్ వల్ల పలు రాష్ర్టాల విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని పేర్కొంటూ సీఎం కేసీఆర్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాసి న లేఖ ప్రతిని వారు మంత్రి కేటీఆర్కు అందజేశారు. విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకొని నీట్ను రద్దు చేయించడంపై అన్ని రాష్ర్టాల సీఎంలతో సంప్రదింపులు జరుపుతున్నామని, సీఎం కేసీఆర్ సహకారాన్ని కోరామని ఎంపీ ఇళంగోవన్ తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నదే తమ అభిమతమని చెప్పారు. తెలంగాణభవన్లో మంత్రి కేటీఆర్ డీఎంకే ఎంపీలను సత్కరించారు. వారు అందించిన లేఖను సీఎం కేసీఆర్కు అందజేసి, విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నేత పర్యాద కృష్ణమూర్తి పాల్గొన్నారు.