చెన్నై : ప్రస్తుత సడలింపులు, ఆంక్షలతో కొనసాగుతున్న లాక్డౌన్ను తమిళనాడు ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడగించింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్ను సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ రాజీవ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల్లో ఇన్ఫెక్షన్లను గుర్తించి వేరు చేయడం అవసరమని, అలాగే కాంటాక్టులను గుర్తించి నిర్బంధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఫేస్ మాస్క్లు, సామాజిక దూరం కఠినంగా పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.