చెన్నై: కరోనా రక్కసి దేశంలోని ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా అంతటా కరోనా చావులు కలకలం రేపుతున్నాయి. కరోనా తీవ్రమై కొందరు, సమయానికి ఆక్సిజన్ అందక కొందరు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకుని కొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. అంతేగాక కుటుంబంలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఆ మరణవార్తను జీర్ణించుకోలేక గుండెలు ఆగిపోయి మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇక ఆస్పత్రుల్లో కరోనా బాధితుల బాధలు కరోనా బాధితులకు ఉంటే.. ఆస్పత్రుల బయట వారి కుటుంబసభ్యుల అవస్థలు వర్ణనాతీతం. తమవారికి అసరమైన ఆక్సిజన్ కోసం, రెమ్డిసివిర్ ఇంజక్షన్ల కోసం వారు ప్రభుత్వ ఆస్పత్రుల ముందు యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలోని కిల్పాక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ముందు కరోనా బాధితుల బంధువులు రెమ్డిసివిర్ ఇంజక్షన్ల కోసం భారీ సంఖ్యలో గుమిగూడారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది చిత్రాల్లో చూడవచ్చు.